Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2020లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాలనుకున్న హీరో.. చివరికి ఒక్క సినిమాతోనే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న నితిన్ ఈ ఏడాది మొదట్లో భీష్మ సినిమాతో అయితే కెరీర్ లోనే మరో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. అసలైతే ఈ ఏడాది నితిన్ మినిమమ్ మూడు సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నాడు.
మూడు కాకపోయినా రెండు సినిమాలనైతే పక్కా రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. భీష్మ అనంతరం రంగ్ దే సినిమాతో దసరాకు రావాలని అనుకున్నాడు. ఒక విధంగా రంగ్ దే సినిమాను చేస్తూనే మరో సినిమాను కూడా పూర్తి చేసి ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు. అప్పటికే అందాదున్ కథను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు.
కానీ లాక్ డౌన్ దెబ్బకు నితిన్ ప్లాన్ మొత్తం మారిపోయింది. దుబాయ్ లో ప్లాన్ చేసుకున్న పెళ్లితో పాటు సినిమా ప్లాన్స్ కూడా మార్చాల్సి వచ్చింది. రంగ్ దే సినిమా షూటింగ్ కు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదైనా అనుకున్నట్లుగా హిట్స్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇటీవల చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఛెక్ అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నితిన్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.