Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టార్గెట్ ప్రభాస్... ‘సాహో’ రిలీజ్ వేళ కావాలనే నెగెటివ్ ప్రచారమా?
ప్రభాస్ త్వరలో 'సాహో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాహుబలి 2 విడుదల తర్వాత యంగ్ రెబల్ స్టార్ నుంచి సినిమా రావడానికి రెండేళ్లకుపైగా సమయం పట్టింది. రావడం కాస్త లేటైనా... అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ మూవీతో బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాడు.
సుజీత్ దర్శకత్వం వహించిన 'సాహో' యూవి క్రియేషన్స్ నిర్మాణంలో రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.
రిలీజ్ వేళ ప్రభాస్ మీద నెగెటివ్ ప్రచారం
అయితే ‘సాహో' రిలీజ్ వేళ సోషల్ మీడియాలో కొందరు యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల విడుదలైన సాహో సాంగులో కొన్ని యాంగిల్స్లో ప్రభాస్ లుక్ మంచు విష్ణు, కొన్ని యాంగిల్స్లో నితిన్, సాయి ధరమ్ తేజ్లా కనిపిస్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ట్వీట్లతో సోషల్ మీడియాలో రగడ
తమ హీరో ప్రభాస్ మీద వస్తున్న ఈ ట్రోల్స్ మీద ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్కు కౌంటర్ ఇస్తూ యంగ్ రెబల్ ఫ్యాన్స్ పవర్ ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిన్నగా మొదలైన ఈ చర్చ చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
అభిమాను ఆకలి తీర్చే విందు భోజనంలా...
‘సాహో' మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే రిలీజ్ డేట్ వాయిదా వేశారట. క్లైమాక్స్ ఫైట్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగోకపోవడంతో వాటిని మళ్లీ విజువలైజ్ చేస్తున్నారని టాక్. అందుకే సినిమా విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చారు. సినిమా కాస్త ఆలస్యమైనా అభిమానుల ఆకలి తీర్చే విందుభోజనంలా ఉంటుందని అంటున్నారు.
సాహో
'సాహో' చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలను ఇందులో ప్రధాన తారాగణంగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.