Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ప్రభాస్ కొత్త సినిమా కోసం బిగ్ ప్లాన్ వేసిన యూవీ క్రియేషన్స్.. జెట్ స్పీడ్ లో ఫినిష్ అయ్యేలా..?
రెబల్ స్టార్ ప్రభాస్ గతకొంత కాలంగా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్ల పాటు మరో కమిట్మెంట్ లేకుండా ఒక సినిమాకు వర్క్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత అయినా చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలని అనుకున్నాడు. ముఖ్యంగా వంద కోట్ల సినిమాలను కొంతకాలం వరకు తగ్గించాలని అనుకున్నాడు. కానీ బాహుబలి ఎఫెక్ట్ వలన పాన్ ఇండియా కథలు ఎక్కువగా రావడంతో మార్కెట్ ను మిస్ చేసుకోవద్దని పెద్ద సినిమాలను లైన్ లో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక సాహో అంచనాలను అందుకోక పోయినప్పటికి హిందీ లో మాత్రం మార్కెట్ తగ్గలేదు. ఇక వచ్చిన ఆఫర్స్ లలో మంచి వాటిని ఓకే చేసుకుంటూ వెళుతున్నాడు.
వీలైనంత అన్ని భాషల వారికి నచ్చేలా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. సాహో అనంతరం రాధేశ్యామ్ సినిమాను కూడా తొందరగానే ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా షూటింగ్స్ కు కూడా చాలాసార్లు బ్రేకులు పడ్డాయి. ఇక రాధేశ్యామ్ అనంతరం ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాను విడుదల చేయనున్న ప్రభాస్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే కుదిరితే ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో మరొక సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇటీవల మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మారుతి ఒక హారర్ కామెడీ కథ రెడీ చేసుకున్నట్లుగా తెలుసుకున్న ప్రభాస్ అతన్ని పిలిపించుకుని మరి సినిమాను చేద్దామని అని ఆఫర్ ఇచ్చాడట.
ఆ సినిమా కథకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే ఆ కథను మారుతి రవితేజ కోసం అనుకున్నాడట. కానీ ఆ ప్రాజెక్ట్ చేసేంత తీరిక లేకపోవడంతో రవితేజ కొంత కాలం ఆగమని చెప్పాడట. ఇక ఇంతలో ప్రభాస్ నుంచి పిలుపు రావడంతో మారుతి సంతోషించాడట. ఇక ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా కొద్దిగా కథను మారిస్తే సరిపోతుందని మళ్ళీ స్క్రిప్ట్ పై సీరియస్ గా కూర్చున్నాడట. ఇక ఆ సినిమాకు సంబంధించిన లాంచ్ పనులను మొదలు పెట్టాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సినిమాను మొదలు పెట్టింది మూడు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మారుతి ముగ్గురు హీరోయిన్స్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అలాగే త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడితో మరొక కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.