Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అప్పుడే మరో రెండు బిగ్ డీల్స్ సెట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో వైష్ణవ్ తేజ్ మెగా కటౌట్ కు తగ్గట్లుగానే క్రేజ్ అందుకుంటున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలి అనే ఫార్ములాను మొదటి అడుగులోనే పెట్టేశాడు. ఇక రానున్న ప్రాజెక్టులు కూడా మరింత విభిన్నంగా ఉండాలని వైష్ణవ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
సాధారణంగా మెగాస్టార్ తన ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు కేవలం మొదటి రెండు సినిమాల వరకే సలహాలు ఇస్తుంటారు. ఇక ప్లాప్స్ ఎదురైతే కూడా అప్పుడప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు. ఇక వైష్ణవ్ తేజ్ ఆలోచన విధానం మొదటి రెండు సినిమాలకే నచ్చడంతో అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వైష్ణవ్ తొందరపడకుండా ఎప్పటికప్పుడు మెగాస్టార్ తో కొత్త కథలపై చర్చలు జరుపుతున్నాడట.
ఇక రీసెంట్ గా ఆదిత్య వర్మ దర్శకుడైన గిరిశయతో ఒక సినిమాను స్టార్ట్ చేసిన వైష్ణవ్ అప్పుడే మైత్రితో మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒక ప్రాజెక్ట్ కు హీరోయిన్ కృతి శెట్టి ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఇక మరో సినిమా కథ ఇంకా పూర్తవ్వలేదట గాని వైష్ణవ్ మాత్రం వచ్చే ఏడాది మైత్రి మూవీ మేకర్స్ తోనే వరుసగా రెండు సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక క్రిష్ దర్శకత్వంలో పూర్తి చేసిన జంగిల్ బుక్ అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది.