Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
నాని టీమ్ తో మరో సినిమాను లైన్ లో పెట్టిన వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సాఫీస్ వద్ద అత్యదిక లాభాలను అందించిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డుకు ఎక్కాడు. ఆ సినిమా అనుకున్నట్లుగానే 100కోట్ల బిజినెస్ చేయడంతో అతని కెరీర్ కు సరైన ట్రాక్ సెట్టయ్యింది. ఇక అవకాశాలు కూడా వరుసగా క్యూ కట్టయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేశాడు.
మరో మూడు కొత్త సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో గిరిషయ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన వైష్ణవ్ ఆ తరువాత ఉప్పెన నిర్మాతలతోనే మరో రెండు సినిమాలు చేయడానికి కమిట్మెంట్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అందులో ఒక సినిమాలో మరోసారి ఉప్పెన జోడి రిపీట్ కానున్నట్లు సమాచారం. ఇక మరొక సినిమా చేయడానికి న్యూ ప్రొడక్షన్ హౌజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టక్ జగదీష్ సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్ వరుసగా యువ హీరోలతో సినిమాలు చేయడానికి కమిట్మెంట్ తీసుకుంటోంది. ఇక అందులో వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నట్లు సమాచారం. స్టోరీ కూడా సెట్టయిందట. ఇక వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ చేసిన సినిమా కరోనా తగ్గిన తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది.