Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఓటీటీలోకి పంజా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా: టైటిల్ రివీల్ కాకముందే భారీ డీల్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అయితే, హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుని తన సత్తాను నిరూపించుకున్నాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సన రూపొందించిన 'ఉప్పెన'తో హీరోగా వచ్చిన అతడు.. మొదటి చిత్రంతోనే యాభై కోట్ల క్లబ్లో చేరిపోయాడు. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఫలితంగా టాలీవుడ్లో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ను కూడా పెంచుకున్నాడు.
'ఉప్పెన' మూవీ విడుదల కాకముందే తన రెండో చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకు అనుగుణంగానే దీనికి పలు సంస్థల నుంచి భారీ స్థాయిలో డీల్స్ వస్తున్నాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైష్ణవ్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఏ డీల్కు ఓకే చెప్పాలా అని ఆలోచిస్తున్నారట నిర్మాతలు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫుల్ ఎమోషన్స్తో సాగే ఈ సినిమా పల్లెటూరి వాతావరణంలో రూపొందనుందని తెలుస్తోంది. అంతేకాదు, దీనికి 'జంగిల్ బుక్' అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్పై క్లారిటీ రాకపోయినా.. పాటలు, టీజర్, పోస్టర్, ట్రైలర్ వంటివి ఏమీ విడుదల కాకపోయినా.. మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. దీన్ని రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మిస్తున్నారు.