అత్తారింటికి దారేది రీమేక్ టీజర్ వచ్చేసింది.. స్టైలిష్ లుక్లో శింబు!
స్టైలిష్ హీరో శింబు ప్రస్తుతం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో వంత రాజవతాన్ వరువేన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శింబు నటిస్తున్న ఈ చిత్రాన్ని సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. శింబు సరసన మేఘా ఆకాష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్ర టీజర్ ని విడుదుల చేశారు. శింబు స్టయిలిష్ లోక్ లో అదరగొడుతున్నాడు.
సుందర్ సి ఈ చిత్రాన్ని కలర్ ఫుల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాట్రోగ్రఫీ అద్భుతంగా వచ్చింది. కలహాలతో విడిపోయిన తండ్రి కూతుళ్ళని కలిపే భాద్యతని హీరో తీసుకుంటాడు. అదే ఈ చిత్రంలోని ప్రధాన అంశం. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

తమిళంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన అత్త పాత్రలో రమ్య కృష్ణ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ చిత్రాన్ని శింబు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











