Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దసరాని టార్గెట్ చేసిన మామ అల్లుళ్లు!
సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రం విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. గోదావరి జిల్లాలో ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం ఉండడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు.
ఆశ్రిత వివాహం ఇటీవల పూర్తయింది. దీనితో మళ్ళీ వెంకీ మామ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఆదివారం రోజు జరిగిన మజిలీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా వెంకీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక నుంచి గ్యాప్ లేకుండా వెంకీ మామ షూటింగ్ జరగనుందట. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. సురేష్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ నుంచి వచ్చిన యువకుడిగా కనిపిస్తారట. ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాశిఖన్నా చైతూకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి డిమాండ్ నెలకొని ఉంది.