Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దసరాని టార్గెట్ చేసిన మామ అల్లుళ్లు!
సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రం విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. గోదావరి జిల్లాలో ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం ఉండడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు.
ఆశ్రిత వివాహం ఇటీవల పూర్తయింది. దీనితో మళ్ళీ వెంకీ మామ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఆదివారం రోజు జరిగిన మజిలీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా వెంకీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక నుంచి గ్యాప్ లేకుండా వెంకీ మామ షూటింగ్ జరగనుందట. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. సురేష్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ నుంచి వచ్చిన యువకుడిగా కనిపిస్తారట. ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాశిఖన్నా చైతూకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి డిమాండ్ నెలకొని ఉంది.