Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొత్త విద్యను నేర్చుకుంటోన్న విజయ్ దేవరకొండ: అప్పటి నుంచే రింగులో అడుగు పెడతాడట
చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ను ప్రారంభించాడు లోకల్ బాయ్ విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. అందులో పక్కింటి అబ్బాయిలా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్గా దర్శనమిచ్చి యూత్ ఐకాన్గా మారిపోయాడు. అప్పటి నుంచి పలు విజయాలు అందుకుని.. కొన్ని పరాజయాలను చవి చూస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగానూ ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడీ రౌడీ స్టార్.
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమే 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లిపోయింది. ఇక, ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడట. కేవలం బేసిక్స్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ బాక్సర్లా కనిపించాలన్న లక్ష్యంతో తెగ కష్టపడుతున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ ట్రైనింగ్ సెషన్ ఎప్పటి నుంచో జరుగుతుందని, మరో వారం రోజులు ఉంటుందని టాక్.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న 'లైగర్'ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కొన్ని ముంబైలో చాలా వరకు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. కరోనా కారణంగా ప్యాకప్ చెప్పేసింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత మార్చి నాలుగో వారం నుంచి చిత్రీకరణ పున: ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.