Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘లైగర్’ కోసం విజయ్ దేవరకొండ డేరింగ్ స్టెప్: తన మార్క్ చూపించేందుకే ఈ నిర్ణయం
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. కేవలం టాలెంట్తోనే స్టార్డమ్ను సంపాదించుకున్న హీరోల్లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ వెంటనే చేసిన 'అర్జున్ రెడ్డి'తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్లోనూ చేరాడు. ఫలితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను అందుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఓ డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు.
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ డబ్బింగ్ను విజయ్ స్వయంగా చెప్పబోతున్నాడట. ఇందుకోసం భాషపై మరికొంత పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడని టాక్.
ఫోటోలు: బెంగాలీ భామ బోల్డ్ ఫోటోషూట్ మీరు ఎప్పుడూ చూడని పిక్స్
బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అప్పటి నుంచి చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న యూనిట్.. ఇప్పుడు చిత్రీకరణను పున: ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే విజయ్ సహా మిగిలిన వారందరూ ముంబై చేరుకున్నారు. ఇక, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.