Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇలాంటి సమయంలో లేనందుకు బాధగా ఉంది.. దటీజ్ విజయ్
రౌడీ బాయ్, టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడో అందరకీ తెలిసిందే. విజయ్ తన సినిమాలతో ఎంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతకు పదింతల ఫాలోవర్లను తన యాటిట్యూడ్, బిహేవియర్తో సంపాదించుకున్నాడు. విజయ్ ఏది చేసినా ఓ ప్రత్యకత దాగి ఉంటుంది. సినిమాల్లో అయినా, ప్రైవేట్ ఈవెంట్లైనా, పబ్లిక్లో మాట్లాడినా విజయ్ తన ముద్రను చూపిస్తాడు.
ప్రస్తుతం విజయ్ యూరప్లో స్వేచ్చగా విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య విజయ్ ప్రజాస్వామ్యం, ఓటు హక్కు గురించి మాట్లాడి నేషనల్ వైడ్గా వివాదాన్ని సృష్టించాడు. ఓటు హక్కు అందరికీ అవసరం లేదని, లిక్కర్ కోసం అమ్ముకునే వారికి, బాగా డబ్బున్న వాళ్లకు ఓటు హక్కు తీసేస్తే మంచిదన్నట్టు మాట్లాడాడు. విజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపించాయి.
తాజాగా విజయ్ హైద్రాబాద్ పరిస్థితిని తలుచుకుని బాధపడ్డాడు. ఎడతెగని వానలు కురవడం, వరదలు సిటీని ముంచెత్తడంపై విజయ్ ఆందోళన చెందాడు. ఇళాంటి సమయంలో అక్కడ నేను అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది.. మీ అందరి కోసమే నేను ఆలోచిస్తున్నా.. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా.. తొందరగా అక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అంటూ విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.