Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
India Vs Pak మ్యాచ్లో విజయ్ దేవరకొండ హంగామా.. ఆ క్రికెట్ కెప్టెన్ బయోపిక్లో నటిస్తా అంటూ రౌడీ స్టార్
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లను రాబడుతూ భారీ డిజాస్టర్గా మారింది. అయితే హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా విజయ్ దేవరకొండ తన ముందస్తు ప్లాన్ ప్రకారం ప్రమోషన్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాడు. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ టీమ్తో చిట్ చాట్ చేస్తూ విజయ్ దేవరకొండ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..
దుబాయ్లో లైగర్ ప్రమోషన్స్
లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ దుబాయ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్తో జరిగిన ఇండియా మ్యాచ్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఫోటోలు వైరల్ అయ్యాయి. మ్యాచ్ను వీక్షిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ రేపాయి.
ఇర్ఫాన్ పఠాన్తో విజయ్ దేవరకొండ
ఇక ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్కు ముందు విజయ్ దేవరకొండ ఇండియన్ క్రికెటర్లను కలిశాడు. ఇర్ఫాన్ పఠాన్, ఇతర క్రికెటర్లతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను అభిమానులు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అయింది.
|
వీ ఆర్ ఇండియన్స్ అంటూ
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వీఆర్ ఇండియన్స్ అనే లైగర్ సినిమా డైలాగ్ను లైవ్లో వినిపించారు. లైగర్ సినిమాకు సంబంధించిన విషయాలను కామెంటేటర్లతో విజయ్ దేవరకొండ పంచుకొన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ను ఆసక్తికరంగా తిలకించాడు.
|
విజయ్ అంకితభావంపై ప్రశంసలు
అయితే లైగర్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ సినిమాను ప్రమోషన్ చేస్తూ చూపిస్తున్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైగర్ సినిమా ఫెయిల్.. కానీ విజయ్ దేవరకొండ ఫెయిల్ కాలేదు. సిన్సియర్గా 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. ఉత్తరాదిలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఒక పరీక్ష ఫెయిల్ అయితేనే బయటకు వెళ్లాలి అంటే.. సిగ్గు పడుతాం. అలాంటిది ప్యాన్ ఇండియా లైగర్ పోయాక కూడా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తున్న తీరుకు దండాలు పెట్టాలని నెటిజన్ కామెంట్ చేశాడు.
|
విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా
లైగర్ సినిమా ప్రమోషన్లో భాగంగా మ్యాచ్ను హోస్ట్ చేస్తున్న కామెంటేటర్లతో విజయ్ దేవరకొండ మాట్లాడాడు. ఏ క్రికెటర్ బయోపిక్ చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు అని కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ.. ధోని భాయ్ బయోపిక్ ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ అన్న బయోపిక్ చేయాలని ఉంది అని అన్నాడు.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా లైగర్
ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రం దక్షిణాదిలో డిజాస్టర్గా నిలిచింది. అయితే హిందీ వెర్షన్ ఉత్తరాదిలో మెరుగైన వసూళ్లను రాబడుతున్నది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ బాధ్యతను విజయ్ దేవరకొండ కొనసాగిస్తున్నాడు.