Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘పుష్ప’ నుంచి ఆ హీరో ఔట్: మరో స్టార్ కోసం అన్వేషిస్తున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా రేంజ్తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. మన్యం ప్రాంతంలో జరుగుతోన్న షూటింగ్లో హీరో ఇంట్రడక్షన్ సీన్లకు సంబంధించిన భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ ఏకధాటిగా జరగనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అయితే, ఆయన అనూహ్యంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ.. డేట్స్ అడ్జస్ట్ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారట. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి కోసం రాసిన క్యారెక్టర్కు మరో స్టార్ హీరోను అన్వేషిస్తున్నాడట అల్లు అర్జున్. ఇప్పటికే పలువురి పేర్లను దర్శకుడు సుకుమార్తో కలిసి పరిశీలించాడట. అయినప్పటికీ ఈ రోల్ విషయంలో క్లారిటీ మాత్రం లేదని సమాచారం.
గతంలో ఈ పాత్ర కోసం యంగ్ హీరో నారా రోహిత్ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత కొంత మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చినా అవి పుకార్లుగానే ఆగిపోయాయి. వాస్తవానికి పాన్ ఇండియా సినిమా కావడంతో మరో ఇండస్ట్రీకి చెందిన హీరోనే తీసుకోవాలని అల్లు అర్జున్ అండ్ కో భావిస్తుందట. అందుకే పర్ఫెక్ట్ యాక్టర్ దొరికే వరకూ అన్వేషణ కొనసాగించాలని డిసైడ్ అయ్యారని టాక్.