Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విశాల్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది!
హీరో విశాల్ తరచుగా వార్తల్లో ఉండే వ్యక్తి. విశాల్ సినిమాల పరంగానే కాక తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విశాల్ సీనియర్ నటి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ఖుష్బూనే నిర్మాత. ఈ చిత్రం తర్వాత విశాల్ నటించే తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
విశాల్, సమంత జంటగా నటించిన ఇరుంబు తీరాయ్ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. రెండు భాషల్లో అభిమన్యుడు చిత్రం మంచి విజయం సాధించింది. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. విశాల్ ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పూర్తి కాగానే అభిమన్యుడు 2 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అభిమన్యుడు 2కి మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా విశాల్ కు, హైదరాబాద్ కు చెందిన అనీషా అనే యువతికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.