Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
పక్కా ప్రామిస్ అంటున్న నితిన్.. రెండు సినిమాలు లైన్లో!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రకటన జరిగి చాలా కాలం అవుతున్నా నితిన్ ఇంతవరకు షూటింగ్ ప్రారంభించలేదు. దీనితో నితిన్ కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. వెంకీ కుడుముల దర్శత్వంలో నటించే చిత్రాన్ని భీష్మ అనే టైటిల్ ఖరారు చేశారు. భీష్మ అప్డేట్ కావాలని ఫాన్స్ అడుగుతుండడంతో నితిన్ తాజాగా ట్విట్టర్ లో స్పందించాడు.
నా కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రకటన ఈ నెలాఖరులోగా వస్తుంది. ప్రక్కా ప్రామిస్.. షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుంది. ఈ ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన కథలు సిద్ధం అవుతున్నాయి. ఆలస్యం అవుతున్నందుకు సారీ అని నితిన్ ట్వీట్ చేశాడు. భీష్మ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది.