Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పక్కా ప్రామిస్ అంటున్న నితిన్.. రెండు సినిమాలు లైన్లో!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రకటన జరిగి చాలా కాలం అవుతున్నా నితిన్ ఇంతవరకు షూటింగ్ ప్రారంభించలేదు. దీనితో నితిన్ కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. వెంకీ కుడుముల దర్శత్వంలో నటించే చిత్రాన్ని భీష్మ అనే టైటిల్ ఖరారు చేశారు. భీష్మ అప్డేట్ కావాలని ఫాన్స్ అడుగుతుండడంతో నితిన్ తాజాగా ట్విట్టర్ లో స్పందించాడు.
నా కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రకటన ఈ నెలాఖరులోగా వస్తుంది. ప్రక్కా ప్రామిస్.. షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుంది. ఈ ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన కథలు సిద్ధం అవుతున్నాయి. ఆలస్యం అవుతున్నందుకు సారీ అని నితిన్ ట్వీట్ చేశాడు. భీష్మ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది.