Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
యాక్టర్ కుష్బూ ఫ్యామిలీలో కరోనా విషాదం.. చివరిచూపుకు దూరంగా నటి
కరోనావైరస్ విచ్చలవిడిగా వెంటాడుతుండటంతో సినీ ప్రముఖులకు విషాదాన్ని మిగిలుస్తున్నాయి. సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్తోపాటు పలువురు సినీ ప్రముఖులు కొవిడ్ 19 కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల కాకుండా వేలాది మంది కరోనాకు బలి అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి కుష్బూ కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. వివారాల్లోకి వెళితే..
కుష్బూ ఇంట్లో విషాదం
నటి, రాజకీయ వేత్త కుష్బూ ఇంట్లో విషాదం నెలకొనడంతో ఒక్కసారిగా సన్నిహితులు ఉలిక్కిపడ్డారు. ముంబైలో కుష్బూ వదిన కొవిడ్ 19 కారణంగా మరణించారు. దాంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. తన ఇంట్లో చోటుచేసుకొన్న విషాదం గురించి కుష్బూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నా వదిన ప్రాణాంతక వ్యాధితో
తన వదిన మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కుష్బూ ట్విట్టర్లో స్పందించారు. ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కారణంగా నా వదిన మరణించారు. మా కుటుంబానికి దూరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరం. మా వదిన లేని లోటు తీరని బాధను కలిగిస్తున్నది అని కుష్బూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
అంత్యక్రియలకు కుష్బూ దూరం
కొవిడ్ 19 నిబంధనలు, ఆంక్షల కారణంగా కుష్బూ తన వదిన అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. చెన్నై నుంచి ముంబై వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో చివరిచూపు చూసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. ముంబై, తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తున్న తీరు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నది.
కుష్బూకు కోలీవుడ్ ప్రముఖుల సంతాపం
ఇక కుష్బూ ఇంట్లో చోటుచేసుకొన్న విషాదంపై కోలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ప్రముఖ కోరియోగ్రాఫర్ బృంద, బిగ్బాస్ సెలబ్రిటీ కాజల్ పసుపతి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యాన్ని కూడగట్టుకోవాలి అని పలువురు తమ సంతాపం ప్రకటనలో పేర్కొన్నారు.
Recommended Video
కుష్బూ కెరీర్ గురించి
ఇక కుష్బూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలకు వస్తే.. ప్రస్తుతం రాజకీయాలను, సినీ రంగంలో యాక్టింగ్తోనూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్స్టార్ రజనీకాంత్తో నటిస్తున్నారు. దర్శకుడు సిరుతాయ్ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న రజనీకాంత్ 168వ చిత్రంలో కుష్బూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మీనా కూడా నటించడం విశేషం.