Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అందాల ‘రాజకీయ‘ భామ రీఎంట్రీ.. తెరపైనే కాదు.. పార్లమెంట్లో కూడా రచ్చేనట!
సినీ, రాజకీయ రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన గత కొద్దికాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా ముఖం చాటేశారు. అయితే గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలోనూ, బాహ్య ప్రపంచానికి దూరంగా, మౌనంగా ఉన్న ఆమె మళ్లీ ఫ్యాన్స్కు, క్యాడర్కు దర్శనమివ్వడం కన్నడనాట చర్చనీయాంశమైంది. గ్లామరస్ పొలిటీషియన్ అంతరంగం ఏమై ఉంటుందనే దిశగా చర్చ జరుగుతున్నది. రమ్య అజ్ఞాతంలో ఉండటానికి కారణమేమిటంటే..
స్టార్ హీరోయిన్గా పొలిటికల్ ఎంట్రీ
అందాల భామ రమ్య 2003లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా మారిపోయారు. అయితే కెరీర్ బ్రహ్మండంగా కొనసాగుతుండగానే అందరికీ షాక్ ఇస్తూ 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ నేత రాజీనామా చేయడంతో మాండ్యా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
యంగెస్ట్ ఎంపీగా పార్లమెంట్లోకి రమ్య
నటి రమ్య తన 31వ ఏట పార్లమెంట్లోకి అడుగుపెట్టి అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు నమోదు చేశారు. లోక్సభలో కన్నడ ప్రజల మనోభావాలను వాడివేడిగా వినిపించారు. తక్కువ సమయంలోనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార దిశగా అడుగులేశారు. తదనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా జేడీఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె క్రీయాశీలక రాజకీయాలకు, జీవితానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.
సోషల్ మీడియాకు ముఖం చాటేసి
రమ్య తన సోషల్ మీడియాలో ఏడాది క్రితం జూన్లో ఓ ఫోటోను షేర్ చేశారు. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ముట్టుకోలేదు కూడా. తాజాగా వరసగా ఫోటోలను షేర్ చేసి అభిమానులకు జోష్ను పంచారు. ఏడాది కాలంగా ఎందుకు దూరంగా ఉన్నారంటే సమాధానాన్ని దాటవేస్తూ.. అభిమానుల డిమాండ్ మేరకే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాను అని రమ్మ చెప్పడం గమనార్హం.
Recommended Video
మళ్లీ వెండితెరపైన గ్రాండ్గా
గత సంవత్సర కాలంగా మౌనంగా ఉండటంపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నిరాకరించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ విడిచిపెట్టేది లేదు. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వెనుక ప్రత్యేకమైన కారణం లేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నాను. తర్వలోనే వెండితెర మీద కూడా కనిపిస్తాను. ప్రస్తుతం అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి అని రమ్య చెప్పారు.