Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దృశ్యం 2 ప్రారంభం.. ఫ్యామిలీతో మీనా ఫుల్ హ్యాపీ!
దృశ్యం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి భారీ విజయాలను నమోదు చేసింది. మలయాళంలో మెహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ నటించారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. మలయాళంలో ఈ సీక్వెల్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. మోహన్ లాల్, మీనాలు షూటింగ్లో జాయిన్ అయ్యారు.
కేరళలో జరుగుతున్న షూటింగ్ కోసం చెన్నై నుంచి మీనా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వచ్చింది. దాదాపు ఆరేడు నెలల తరువాత ప్రయాణం చేయడం, పీపీఈ కిట్ ధరించడం వంటి అనుభవాలన్నింటిని చెప్పుకొచ్చింది. వాటిని ధరించడం ఎంత అసౌకర్యంగా ఉన్నా కూడా వారు మనం కోసం, మన ఆరోగ్యాల కోసం ఆలోచిస్తుంటారు. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.. వారికి చేతులెత్తి మొక్కాల్సిందే అంటూ వైద్య బృందానికి ధన్యవాదాలను తెలిపింది.
తాజాగా షూటింగ్ సెట్లో దిగిన ఫోటోను మీనా షేర్ చేసింది. సినిమాలో తన ఫ్యామిలీ అయిన ఇద్దరు పిల్లలు, భర్త జార్జ్ కుట్టితో ఉండటం చాలా సంతోషంగా ఉందని మీనా చెప్పుకొచ్చింది. అయితే దృశ్యంలో ఉన్న చిన్న పాప ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిపోయింది. ఇక మరి ఈ సీక్వెల్ని కూడా మిగతా భాషల్లో రీమేక్ చేస్తారో లేదో చూడాలి. మెహన్ లాల్ ఈ సినిమా కోసం డైట్ మెయింటైన్ చేస్తూ స్లిమ్ లుక్లోకి మారినట్టు కనిపిస్తోంది.