Don't Miss!
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్రైజర్స్ హైదరాబాద్పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దృశ్యం 2 ప్రారంభం.. ఫ్యామిలీతో మీనా ఫుల్ హ్యాపీ!
దృశ్యం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి భారీ విజయాలను నమోదు చేసింది. మలయాళంలో మెహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ నటించారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. మలయాళంలో ఈ సీక్వెల్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. మోహన్ లాల్, మీనాలు షూటింగ్లో జాయిన్ అయ్యారు.
కేరళలో జరుగుతున్న షూటింగ్ కోసం చెన్నై నుంచి మీనా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వచ్చింది. దాదాపు ఆరేడు నెలల తరువాత ప్రయాణం చేయడం, పీపీఈ కిట్ ధరించడం వంటి అనుభవాలన్నింటిని చెప్పుకొచ్చింది. వాటిని ధరించడం ఎంత అసౌకర్యంగా ఉన్నా కూడా వారు మనం కోసం, మన ఆరోగ్యాల కోసం ఆలోచిస్తుంటారు. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు.. వారికి చేతులెత్తి మొక్కాల్సిందే అంటూ వైద్య బృందానికి ధన్యవాదాలను తెలిపింది.
తాజాగా షూటింగ్ సెట్లో దిగిన ఫోటోను మీనా షేర్ చేసింది. సినిమాలో తన ఫ్యామిలీ అయిన ఇద్దరు పిల్లలు, భర్త జార్జ్ కుట్టితో ఉండటం చాలా సంతోషంగా ఉందని మీనా చెప్పుకొచ్చింది. అయితే దృశ్యంలో ఉన్న చిన్న పాప ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిపోయింది. ఇక మరి ఈ సీక్వెల్ని కూడా మిగతా భాషల్లో రీమేక్ చేస్తారో లేదో చూడాలి. మెహన్ లాల్ ఈ సినిమా కోసం డైట్ మెయింటైన్ చేస్తూ స్లిమ్ లుక్లోకి మారినట్టు కనిపిస్తోంది.