Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఓ మైగాడ్.. అందంతో మెరిసి.. చూసుకొని మురిసిన నయనతార
అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న నయనతార తన ప్రియుడితో కలిసి విషు పండుగను ఆనందంగా జరుపుకొన్నది. కేరళలో హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్తో కలిసి తన సొంత పట్టణం కోచికి ఇటీవల ప్రత్యేక విమానంలో చేరుకొన్న సంగతి తెలిసిందే. ఈ పండుగ సందర్భంగా అందంగా ముస్తాబై తనకు తానే మురిసిపోయింది నయనతార. విషు పండుగ సందర్బంగా దిగిన సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
ఓ మైగాడ్.. నా ఫోటోనే నేను చూసుకొన్న తర్వాత ఎప్పుడెప్పుడూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలా అనే ఆతృత కలిగింది. విషు పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ సుందరిని, ఆమె స్టన్నింగ్ లుక్స్ను ఓ సారి చూడండి అంటూ నయనతార తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నది.
నయనతార ప్రస్తుతం రజనీకాంత్, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్ర షూటింగులో కుష్భూ, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్, మీనా తదితరుల పాల్గొంటున్నారు. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి వాకులా రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నది.