Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హీరోయిన్స్లో హీరోగా నిలిచింది.. మంచి మనసును చాటుకున్న బాపుగారి బొమ్మ
ప్రతీసారి హీరోలతో హీరోయిన్స్ పోటీ పడుతూ.. తమకెందుకు తక్కువ పారితోషికం ఇస్తారని, తక్కువ ఎందుకు చూస్తారని అడుగుతుంటారు. అయితే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సాయం చేసేందుకు మాత్రం హీరోలో ముందుకు వస్తుంటారు. చేతనైనా సాయం చేస్తుంటారు. అందుకే వారిని హీరోలని అంటారు.
కరోనా లాంటి భయంకరమైన పరిస్థితి
కరోనా లాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు అండగా సినీ హీరోలు నిలబడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నితిన్ మొదలెట్టిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలందరూ చేరారు.
పవన్, ప్రభాస్ల భారీ విరాళాన్ని..
పవన్ కళ్యాణ్ రెండు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. కేంద్రానికి కోటి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటిని అందజేశాడు. ప్రభాస్ అయితే ఏకంగా నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేంద్రానికి మూడు కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకు కోటిని ప్రకటించాడు.
కదిలిన తారాగణం..
అయితే మిగతా వారంతా తమకు తోచిన సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్, కొరటాల శివ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ, హారిక అండ్ హాసిని సంస్థలు, సాయి ధరమ్ తేజ్ ఇలా ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని ప్రకటించారు.
Recommended Video
|
ఒకే ఒక్క హీరోయిన్..
ఇప్పటి వరకు హీరోలు మాత్రమే విరాళాలు ప్రకటించి.. రియల్ హీరోస్ అనిపించుకున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. కానీ బాపుగారి బొమ్మ అయిన ప్రణీత.. ఓ 50 కుటుంబాలకు సాయం చేసేందుకు గానూ లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించింది. అందరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.