Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
నాకు పిలల్ని కనాలని ఉంది.. మరో కోరిక కూడా ఉంది: ప్రియాంక చోప్రా
అందాల తార ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నది. భర్త నిక్ జోనస్తో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నది. అటు బాలీవుడ్లోనూ.. ఇటు హాలీవుడ్ను బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ను సాఫీగా సాగిస్తున్నది. అయితే తాజాగా తన మనసులోని రెండు కోరికలను బయటపెట్టింది. అవేమిటంటే..
ఇటీవల వోగ్ ఇండియా సెప్టెంబర్ 2019 ఎడిషన్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నా మదిలో రెండే కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి ఓ చిన్నారికి జన్మనివ్వడం. రెండోది లాస్ ఎంజెలెస్లో ఇల్లు కొనుక్కోవడం అని చెప్పారు. లాస్ ఎంజెలెస్ ఎందుకంటే.. అక్కడి వాతావరణం ముంబైకి దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడే స్థిరపడాలని చూస్తున్నాను అని అన్నారు.
ఈ సందర్భంగా తనకు విదేశాల్లో స్థిరపడాలని ఉంది. ప్రస్తుతం స్కై ఈజ్ పింక్ సినిమా చేస్తున్నాను అని చెప్పారు. నా భర్తతో కాపురం సాజావుగా సాగుతున్నది. ఆయన పాట పాడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ ఆయనతో కలిసి ఎన్నడూ పాట పాడటానికి ధైర్యం చేయను. కానీ అప్పుడప్పుడు ఇద్దరం కలిసి హమ్ చేస్తుంటాను అని ప్రియాంక అన్నారు.
సుమారు రెండేళ్ల క్రితం ప్రియాంక, నిక్ జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వర్గాలు హాజరైన సంగతి తెలిసిందే.