Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ హీరోయిన్.. ఇప్పుడైనా సక్సెస్ అవుతుందా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ముంబై హీరోయిన్స్ డామినేషన్ గట్టిగానే ఉండేది. ప్రస్తుతం మలయాళం అమ్మాయిలు, కన్నడ బ్యూటీలు ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు. గోపిచంద్ రణం సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ముంబై భామ కామ్న జఠ్మలానీ. బెండు అప్పరావ్, కత్తి కాంతరావ్ అంటూ అప్పట్లో కాస్త హడావుడిగా కనిపించేది.
చూడగానే తన చిన్న చిరునవ్వుతో ఆకట్టుకునే ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ అనుకున్నంతగా అయితే స్టార్ హీరోయిన్లకు పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తానికి 2014లో ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న కామ్న ఇద్దరు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత హ్యాపీగా తన కుటుంబంతో బిజీగా ఉన్న కామ్న వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్న ఉమెన్ సెంట్రిక్ సినిమాలో కామ్న జఠ్మలానీ మెయిన్ లీడ్ లో కనిపించబోతోంది. పెళ్లి తరువాత అవకాశాలు వచ్చినప్పటికీ ఎందుకో ఆ ఆఫర్స్ కి ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా ప్రభు అనే దర్శకుడు చెప్పిన కథ తనను బాగా ఎట్రాక్ట్ చేసిందని ఈ బ్యూటీ 5 ఏళ్ళ తరువాత కెమెరా ముందుకు రాబోతోంది. మరి ఆ కొత్త సినిమాతో కామ్న ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.