Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2.0లో ఐశ్వర్యరాయ్.. చిట్టి రోబోతో రొమాన్స్!
అందాల తార ఐశ్వర్యారాయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ 2.0 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ చిట్టి రోబోగా, సైటిస్టుగా కొనసాగబోతున్నాడు. హీరోయిన్ గా అమీజాక్సన్, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
రజినీకాంత్ కీ ఆ పూరి గుడిసెతో ఉన్న అనుబందం ఏమిటీ? ఇప్పటికీ అందులోనే
ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమిళ సినీవర్గాలు ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో కాసేపు ఐశ్వర్యరాయ్ తళుక్కున మెరవబోతున్నట్లు బోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సూపర్ విలన్ గా మొబైల్ ఫోన్స్ ని కంట్రోల్ చేసే శక్తులతో కనిపించబోతున్నాడు. ఈ సూపర్ విలన్ ని చిట్టి రోబో ఎలా అంతమొందించిందనేదే కథ. నవంబర్ 29 న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ లో 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు.