Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2.0లో ఐశ్వర్యరాయ్.. చిట్టి రోబోతో రొమాన్స్!
అందాల తార ఐశ్వర్యారాయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ 2.0 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ చిట్టి రోబోగా, సైటిస్టుగా కొనసాగబోతున్నాడు. హీరోయిన్ గా అమీజాక్సన్, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
రజినీకాంత్ కీ ఆ పూరి గుడిసెతో ఉన్న అనుబందం ఏమిటీ? ఇప్పటికీ అందులోనే
ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమిళ సినీవర్గాలు ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో కాసేపు ఐశ్వర్యరాయ్ తళుక్కున మెరవబోతున్నట్లు బోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సూపర్ విలన్ గా మొబైల్ ఫోన్స్ ని కంట్రోల్ చేసే శక్తులతో కనిపించబోతున్నాడు. ఈ సూపర్ విలన్ ని చిట్టి రోబో ఎలా అంతమొందించిందనేదే కథ. నవంబర్ 29 న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ లో 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు.