Rashmika Mandanna: రెడ్ శారీలో శ్రీవల్లి గ్లామర్ షో.. ఆ అందాలని అస్సలు దాచట్లేదుగా!
Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన. పాన్ ఇండియా మూవీలో నటిస్తూ.. నేషనల్ క్రష్ గా మారింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో మూవీ పుష్పతో అమ్మడు దశ మారిపోయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఎనలేని క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే తన అందం అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ తొలుత కన్నడ సినిమాలతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన 'అంజనీపుత్ర' అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా ఆఫర్లను అందుకుంది. ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకుంది. ఇలా నాగశౌర్య హీరోగా నటించిన 'చలో' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

ఆ తరువాత గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఈ మూవీ హిట్ కావడంతో తెలుగులోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ క్రమంలోనే నానితో దేవదాస్ మూవీలో నటించే అవకాశం అందుకుంది. మరోవైపు గీత గోవిందం మూవీ సూపర్ హిట్ అవ్వడంతో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో నటించి మెప్పించింది. ఆ తరువాత మహేష్ బాబు -అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' హీరోయిన్ నటించే అవకాశం అందుకుంది. ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా మారింది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 1లో శ్రీ వల్లి పాత్రలో నటించి, తన అందం, అభినయంతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మారైజ్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక మందన్నా దశ తిరిగింది. ఈ ఫేమ్ తో బాలీవుడ్ అడుగుపెట్టింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన 'యానిమల్' మూవీలో రష్మిక తన నట విశ్వరూపాన్ని చూపించి నేషనల్ క్రష్ గా మారింది. ప్రస్తుతం పుష్ప 1కి సీక్వెల్ గా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సినిమాలతో బిజీ బిజీగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో 44.4 మిలియన్ ఫాలోవర్లు సొంతం చేసుకుని అరుదైన రికార్డు నమోదు చేసింది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది చీరకట్టులో రష్మిక మరింత అందంగా వెలిగిపోతుంది ట్రెండి డ్రెస్ లలో క్యూటీ గా కనిపించే రష్మిక చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలలో రెడ్ శారీ, క్లీవ్లెస్ బ్లౌస్ లో తన అందాలను ఆరబోస్తూ.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. ఆ పోజులను చూస్తే కుర్రాళ్లకు చెమటలు పట్టాల్సిందే. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.


Click it and Unblock the Notifications











