అమలాపాల్ హాట్ లుక్.. నెటిజన్ల కొంటె కామెంట్లు
అందంతో పాటు నటనతోనే ఎందరినో ఆకట్టుకుంది అమలాపాల్. సెలెక్టెవిగ్ సినిమాలు చేస్తూ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. తెలుగు చిత్రంలో కనిపించి చాలా కాలమే అవుతున్నా.. రీసెంట్గా ఆమె అనే ఓ ద్విభాషా చిత్రంతో పలకరించింది. పూర్తి నగ్నంగా ఉన్న టీజర్ను విడుదల చేసిన సెన్సేషన్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. అయితే అమలాపాల్ లాంటి యాక్టర్ అలా నగ్నంగా నటించేసరికి సినిమాపై ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది.

కలిసి రాని ప్రేమ బంధం..
ప్రేమించి పెళ్లాడిన భర్తను ఎక్కువ కాలం జీవితాన్ని కొనసాగించలేకపోయింది అమలాపాల్. నాన్న, అన్న, కణం లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కే ఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లాడింది అమలా పాల్. నాన్న, విజయ్ ‘అన్న' సినిమాలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ ప్రేమ వివాహబందంగా మారినా.. ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు.

విడాకులతో ముగిసిన వివాహాబందం..
2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2016లో వేరు పడి 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే విజయ్ మళ్లీ ఓ డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ అమలాపాల్ మాత్రం పెళ్లికి దూరంగానే ఉంది. మాజీ భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న సందర్భంలో అమలాపాల్ మాట్లాడుతూ.. అతను చాలా మంచి వ్యక్తి.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ చెప్పుకొచ్చింది. కుటుంబ కలహాల వల్లే వీరిద్దరు వీడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రపంచాన్ని చుట్టేస్తూ..
అమలాపాల్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని చుట్టేస్తూ బిజీగా ఉంది. విదేశాల్లో తిరుగుతూ.. ప్రతీ క్షణం ఏదోక అప్డేట్ను ఇచ్చేస్తూ ఉంటుంది. ట్రావెటింగ్ అంటే ఇష్టమని చెప్పే అమలాపాల్.. ప్రస్తుతం బాలి (ఇండోనేషియా)లో ఉంది. అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తోంది.

పూల తొట్టెలో స్నానం..
పూల తొట్టెలో స్నానం చేస్తూ.. పక్కనే ఉన్న వాగులు వంకలను చూస్తూ ప్రకృతిని ఆస్వాధిస్తూ ఉంది అమలాపాల్. అక్కడి వరకు బాగానే ఉన్న స్నానం చేస్తూ ఉన్న అమలా.. వీపును, ట్యాటూను చూపిస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తుంటరి నెటిజన్లు ఊరికే ఉంటారా.. వారి కామెంట్లతో పిక్ను వైరల్ చేసేస్తున్నారు. ఈ సమయంలో మీ ముందు వైపు ఉంటే ఎంత బాగుంటుందని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

లస్ట్ స్టోరీస్ రీమేక్లో అమలా..
హిందీలో మంచి హిట్ అందుకున్న ‘లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘ఆమె' సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే హిందీలో చూపించినట్లుగా తెలుగు సన్నివేశాలు ఉండవని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు.
బిజీగా మారిన అమలాపాల్..
ఆమె చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించకపోయినా.. అమలాపాల్కు మాత్రం ఎక్కడాలేని క్రేజ్ను తీసుకొచ్చింది. ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్ని ఇండస్ట్రీల దృష్టిని తనవైపు లాక్కుంది. అందుకే లస్ట్ సిరీస్ రీమేక్లో చాన్స్ దక్కించుకుంది. దీంతో పాటు అమల ‘ఆడుజీవితం', ‘కాడవర్' అనే సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











