Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమలాపాల్ జాదూ అంటే ఇదే.. అనుష్క, నయనతార చెక్.. ప్రముఖ దర్శకుడిని భలే పట్టిసింది!
నవాబ్ (తమిళంలో చెక్క చివాంత వానమ్) చిత్ర విజయం తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ అనే మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో జోరుగా అంచనాలు పెరుగుతన్నాయి. భారీ బడ్జెట్ చిత్రం కావడం, మల్టీస్టారర్ చిత్రం కావడంతో ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా క్రేజ్ ఊపందుకొన్నది. అయితే ఈ సినిమా నటీనటుల ఎంపిక కోలీవుడ్లో చర్చనీయాంశమవుతున్నది. ఈ చిత్రంలోకి అమలాపాల్ను తీసుకొన్నారనే వార్త క్రేజీగా మారింది. వివరాల్లోకి వెళితే..
పలు భాషల్లో పొన్నియిన్ సెల్వన్
దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నది. తొలుత లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. అయితే ఆర్థిక కారణాల వల్ల సినిమాను లైకా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. ఓ దశలో సినిమా పట్టాలెక్కుతుందా అనే సందేహం తలెత్తింది.
చారిత్రక కథానేపథ్యంతో
మణిరత్నంకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రముఖ తమిళ రచయిత అమరార్ కల్కి రాసిన గొప్ప నవల. ఈ కథ రాజా రాజ చోళ కాలం నాటిది. 2016 నుంచి ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్బాబును హీరోగా పెట్టి తీయాలని ప్లాన్ చేశారు. కానీ ఎందు వలనో ఈ సినిమా ముందుకెళ్లలేకపోయింది.
అగ్ర హీరోయిన్లకు చెక్
ఇదిలా ఉంటే, పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనుష్క, నయనతార, ఐశ్వర్య రాయ్, కీర్తీ సురేష్ పేర్లు కోలీవుడ్లో విస్తృత ప్రచారం అయ్యాయి. అయితే కీర్తీ సురేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. చివరకు ఈ సినిమాలోని పాత్ర కోసం అమలా పాల్ పేరు అనూహ్యంగా పైకి లేచింది. ఈ సినిమాలో అమలాపాల్ను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. అయితే మణిరత్నం మాత్రం ఈ విషయంపై మీడియాలో బయటపడటం లేదు.
కోలీవుడ్లో అమలాపాల్కు ఆఫర్పై
దక్షిణాదిలో వరుస సినిమాలు, సక్సెస్లతో దూసుకెళ్తున్న నయనతార, అనుష్క, కీర్తీ సురేష్ను కాదని అమలాపాల్కు సినిమా అఫర్ దక్కడం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. అమలాపాల్ కెరీర్ చూస్తే ఈ మధ్య కాలంలో ఎలాంటి హిట్లు, సినిమాలు కూడా చేతిలో లేకపోయాయి. కాగా స్వయంగా ఆమె ఓ సినిమాకు నిర్మాతగా కూడా మారారు.
మోహన్బాబు, సత్యరాజ్ కీలక పాత్రల్లో
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మోహన్ బాబు తదితరులు నటిస్తున్నారు. మరో పాత్ర కోసం నటుడు సత్యరాజ్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉంది.