Don't Miss!
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
అక్కినేని నాగ చైతన్య నటించిన 'బెజవాడ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది గ్లామరస్ హీరోయిన్ అమలా పాల్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్తో 'నాయక్', అల్లు అర్జున్తో 'ఇద్దరమ్మాయిలతో', నానితో 'జెండాపై కపిరాజు' అనే సినిమాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్కు టాటా చెప్పేసింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత మరోసారి తెలుగులో నటిస్తోందీ అమ్మడు.
రెండేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది అమలా పాల్. దీని తర్వాత వైవిధ్యమైన పాత్రలను మాత్రమే పోషిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ను చేస్తోంది. సమంతతో 'యూటర్న్' అనే సినిమాను తెరకెక్కించిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్లో ఆమెతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ఈ సిరీస్పై అంచనాలున్నాయి.
ఇక, లాక్డౌన్ తర్వాత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. ఏకధాటిగా సాగిన చిత్రీకరణ రెండు రోజుల క్రితమే ముగిసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ వెంటనే యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేసిందట. ఇదిలా ఉండగా, ఇందులో అమలా పాల్ చేస్తున్న పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. తన గత సినిమాల్లో చేయని కొన్ని సాహసాలు ఇందులో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సిరీస్లో కొంత స్పైసీగానూ కనిపించిందట ఈ సుందరాంగి.