Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలీవుడ్లోకి బన్నీ, రాజ్ తరుణ్ సినిమాలు.. హీరోయిన్గా హైదరాబాద్ అమ్మాయి
ప్రస్తుతం తెలుగు సినిమా కథలు బాలీవుడ్ను ఏలేస్తున్నాయి. మన దగ్గర హిట్ అయిన చిత్రాలు వరుసగా బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. అదే కోవలో మరో రెండు చిత్రాలు రీమేక్ కానున్నాయి. అందులో ఓ విశేషం ఉంది. ఆ రెండు రీమేక్స్లో మన హైద్రాబాద్ అమ్మాయే హీరోయిన్గా నటిస్తోంది. ఇదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మన టాలీవుడ్లో ఎక్కువగా ఉత్తరాది సరుకే కనిపిస్తుంది. దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్లను ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకే ఆసక్తిని చూపుతుంటారు. అలా మన తెలుగులో దాదాపు ఉత్తరాది భామల హవానే కొనసాగుతుంది. కానీ మొదటి సారి మన హైదరాబాదీ అమ్మాయి అమ్రిన్ ఖురేషికి బాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమా చూపిస్త మావ, జులాయి సినిమాలో బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి.
ఆ రీమేక్ చిత్రాలో మన హైదరబాద్ అమ్మాయి హీరోయిన్గా ఎంపికైంది. ప్రస్తుతం అమ్రిన్ ఖురేషి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఒకే సారి రెండు బ్లాక్ బస్టర్ రీమేక్స్లో చాన్స్ కొట్టేయడంతో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అమ్రిన్ ఖురేషి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి కుమార్తె, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ.ఖురేషి మనవరాలు అయిన అమ్రిన్ ఖురేషి ఇప్పుడు సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తోంది.
సినిమా చూపిస్త మావ చిత్రం బాలీవుడ్లో బ్యాడ్బాయ్గా రీమేక్ కాబోతోంది. ఈ చిత్రానికి రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'జులాయి' రీమేక్ను టోని డిసౌజ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు.