Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Amy jackson ప్రియుడితో బ్రేకప్. రెండేళ్ల క్రితమే సహజీవనానికి గుడ్బై.. పెళ్లి కాకుండానే తల్లిగా..
దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బ్రిటీష్ భామ అమీ జాక్సన్ వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడిందనే వార్తలు జోరుందుకొన్నాయి. సోషల్ మీడియాలో అమీ జాక్సన్ చేసిన పని వల్ల ప్రియుడితో విడిపోయిందనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి. అమీ జాక్సన్ బ్రేకప్ విషయంలోకి వెళితే..
పెళ్లి కాకుండానే గర్భవతిగా
అమీ జాక్సన్ సినిమాల్లో రాణిస్తూనే కొద్దికాలంగా ప్రియుడు జార్జ్ పానయిటూతో డేటింగ్ చేస్తున్నది. తమ రిలేషన్షిప్ కారణంగా తొలి బేబికి జన్మినిస్తున్నామని మార్చి 2019లో మీడియాకు ప్రకటించారు. ఆ తర్వాత మే నెలలో వారిద్దరూ వివాహ నిశ్చితార్థం చేసుకొన్నారు. అయితే కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా అమీ జాక్సన్, జార్జ్ పెళ్లి వాయిదా పడిింది.
2019 చిన్నారికి జన్మనిచ్చి అమీ జాక్సన్
అయితే అమీ జాక్సన్ వారిద్దరు ఓ చిన్నారికి జన్మనిచ్చారు. 2019 సెప్టెంబర్ 23వ తేదీన జన్మించిన ఆ బాబుకు ఆండ్రియాస్ అని నామకరణం చేశారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అమీ జాక్సన్కు జార్జ్కు మధ్య వ్యక్తిగత విభేదాలు చోటు చేసుకోవడంతో వారి సహజీవనంలో కలతలు రేగాయి. దాంతో గత రెండేళ్లుగా వారిద్దరి వేర్వేరుగా ఉంటున్నారు. వారిద్దరికి బ్రేకప్ జరిగింది అంటూ సన్నిహితులు వెల్లడిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు డిలీట్
అంతేకాకుండా అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో జార్జ్ ఫోటోలను డిలీట్ చేయడం మరింత బలం చేకూర్చింది. రెండేళ్ల క్రితమే విడిపోవడంతో ఆయన మెమొరీస్ను తన వద్ద ఉండకూడదనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను డిలీట్ చేసినట్టు భావిస్తున్నారు. కానీ తన బ్రేకప్ గురించి అమీ జాక్సన్ ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు.
అమీ ఇక కెరీర్పైనే దృష్టిపెట్టారని
ప్రియుడితో బ్రేకప్ తర్వాత కుమారుడి సంరక్షణ బాధ్యతలు చూసుకొంటున్నారు. ప్రస్తుతం మళ్లీ కెరీర్పై దృష్టిపెట్టారు. ఇండియాకు తిరిగి వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో తన జీవితాన్ని నటనకు అంకితం చేయాలని భావిస్తున్నారు అని అమీ జాక్సన్ సన్నిహితులు మీడియాతో పంచుకొన్నట్టు సమాచారం.
అమీ జాక్సన్ కెరీర్ ఇలా..
ఇక అమీ జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన మద్రాస్ పట్నం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీలో ఏక్ దీవానా థా, తెలుగులో ఎవడు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత విక్రమ్తో ఐ, విజయ్తో తేరి లాంటి సినిమాల్లో నటించింది. హిందీలో సింగ్ ఈజ్ బ్లింగ్, తెలుగులో అభినేత్రి సినిమాల్లో కనిపించింది. చివరిగా కన్నడ చిత్రం ది విలన్లో నటించింది.