Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బూతు మాటలు.. అర్ధనగ్నంగా ఫోజులు.. పునరాలోచనలో పడ్డ యాంకర్ అనసూయ.!
బుల్లితెరపై సత్తా చాటుతూనే సినిమాల్లోనూ రాణిస్తున్న వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.. తన అందంతో ఎంతో మందిని ఫిదా చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ ఓ విషయంలో పునరాలోచనలో పడినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా విషయం.? పూర్తి వివరాల్లోకి వెళితే....
రెండింటిలోనూ చోట్లా సత్తా చాటుతోంది
అనసూయ కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ అనే షోకు యాంకర్గా చేస్తోంది. దీనితో పాటు పలు కార్యక్రమాలను హోస్ట్ చేస్తోంది. అలాగే, సినిమా రంగంలోనూ తనదైన ముద్రను వేస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని చిత్రాల్లో అసాధారణ నటనను కనబరిచి ప్రసంశలు అందుకుంది. దీంతో రెండు రంగాల్లో ఆమె హవా కనిపిస్తోంది.
వాళ్ల అందరి చాయిస్ అనసూయనే
అనసూయ డేట్స్ కోసం టీవీ చానెళ్ల వాళ్లు ఎంతలా పోటీ పడుతున్నారో.. అదే తరహాలో సినిమా రంగానికి చెందిన పలువురు ఫిల్మ్ మేకర్లు సైతం ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఛాన్స్ దొరికిందే పాపం ఆమెను తమ సినిమాల్లో నటించమని కోరుతున్నారు. దీంతో అనసూయకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోతోంది. అనసూయ మాత్రం ప్రాధాన్యాన్ని బట్టి ఒప్పుకుంటోంది.
స్పైసీ రోల్ ఫిక్స్.. అవి మాత్రం సస్పెన్స్
గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఇది నిరాశను మిగిల్చింది. ఇక, ప్రస్తుతం ఆమె కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుందని డైరెక్టరే స్వయంగా ప్రకటించాడు. అలాగే, బన్నీ సినిమాలో సహా మరికొన్నింటిలో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
మరో బోల్డ్ రోల్కు అనసూయ గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అంధాధాన్'ను తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కించబోతున్నారు. మేర్లపాక గాంధీ రూపొందించనున్న ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మాతృకలో సీనియర్ హీరోయిన్ టబు పోషించిన పాత్రనే తెలుగులో అనసూయ చేస్తుందని అంటున్నారు. ఈ రోల్ బోల్డుగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
Recommended Video
పునరాలోచనలో పడ్డ యాంకర్ అనసూయ.!
‘అంధాధాన్' రొమాంటిక్ జోనర్లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అంతేకాదు, టబు కూడా కొన్ని బూతు మాటలు పలకడంతో పాటు కొన్ని సీన్స్లో సెమీ న్యూస్గా దర్శనమిచ్చింది. దీంతో అనసూయ కూడా ఆమెలా చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్లు తాజాగా ఓ వార్త లీక్ అయింది.