twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంపర్ ఆఫర్ పట్టేసిన అనసూయ.. ఎవరూ ఊహించని రీతిలో ఒకే చెప్పింది!

    By Manoj
    |

    బుల్లితెర యాంకర్ అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. టీవీ షోలైనా సినిమాలు అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ రీమేక్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా సినిమా..? వివరాల్లోకి వెళితే..

    సోషల్ మీడియాలో యవ యాక్టివ్

    సోషల్ మీడియాలో యవ యాక్టివ్

    అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ట్రోలర్స్ బారిన పడుతోంది.

    రైటర్‌గా ప్రేక్షకుల ముందుకు

    రైటర్‌గా ప్రేక్షకుల ముందుకు

    అనసూయ తాజా చిత్రం ‘కథనం'. ఇందులో ఆమె రైటర్ పాత్ర‌లో న‌టించింది. ఆమె రాసిన క‌థ బ‌య‌ట జ‌రుగుతుంది. అక్క‌డ గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ రాసిన క‌థే బ‌య‌ట కూడా జ‌రుగుతుంటుంది. ఇక్క‌డ కూడా క‌థ‌లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంద‌ని రాస్తే.. బ‌య‌ట కూడా జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ క‌థ‌నం క‌థ అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు రాజేష్ నాదెండ్ల‌. రెండు రోజుల క్రితమే వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు.

    రంగమ్మత్తగా వెరీ ఫేమస్

    రంగమ్మత్తగా వెరీ ఫేమస్

    అనసూయ.. సినీ కెరీర్‌లో రంగమ్మత్త పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతోంది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం' సినిమాలో ఆమె చేసిన ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. దీని తర్వాత అనసూయకు ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే, ఆమె మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ క్రేజీ యాంకర్ ఓ సినిమాకు ఓకే చేసేసిందని సమాచారం.

    క్రియేటివ్ డైరెక్టర్ సినిమాకు సంతకం

    క్రియేటివ్ డైరెక్టర్ సినిమాకు సంతకం

    టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ వంశీ. కొంత కాలంగా సరైన హిట్ దొరక్క ఇబ్బంది పడుతున్న ఆయన ఇటీవల మరో సినిమాను ప్రకటించాడు. ప్రకాష్ రాజ్‌, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో ఓ క్లాసిక్‌ హిట్‌ను రీమేక్‌ చేస్తున్నట్టుగా తెలిపాడు. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నట సామ్రాట్‌' సినిమాను తెలుగులో ‘రంగమార్తండ' పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఇందులోనే ఓ కీలకమైన పాత్రకు అనసూయను తీసుకున్నారని టాక్.

    Recommended Video

    #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
    రూ. 50 కోట్లు కొల్లగొట్టింది

    రూ. 50 కోట్లు కొల్లగొట్టింది

    బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దతెరకెక్కించిన చిత్రం ‘నట సామ్రాట్‌'. ఈ సినిమాను నానా పటేకర్‌, విశ్వాస్‌ జోషీలు సంయుక్తంగా నిర్మించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘నట సామ్రాట్‌' సంచలన విజయం సాధించటంతో పాటు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాను కృష్ణ వంశీ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

    English summary
    Actress Anasuya Bharadwaj is all set to join the sets of filmmaker Krishna Vamsi’s upcoming film, Rangamarthanda. We’ve been told that the director was fascinated with Anasuya’s screen presence and performance in her earlier film, Rangasthalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X