Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జైలు కూడు కోసం నిరీక్షిస్తున్న కంగన, నటిపై మరో క్రిమినల్ కేసు
కాంట్రవర్శీ క్వీన్ కంగనా పై మరో బాంబ్ పడింది. ఇప్పటికే కంగన పై క్రిమినల్ కేసులు అక్రమ కట్టడం కేసులు బనాయించి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శివసేన ఆమ్మడిని దెబ్బ తీసేందుకు మరో ఎత్తు వేసింది. అయినా సరే ఎక్కడా తగ్గేది లేదు అంటూ సవాళ్లు విసురుతుంది ఈ ఫైర్ బ్రాండ్. ఈ నేపథ్యంలో కంగనాకు మరో షాక్ తగిలింది.
కంగనాపై క్రిమినల్ కేసు నమోదై వారం కూడా పూర్తికాక ముందే తాజాగా మరో కేసు అమ్మడు మెడకు చుట్టుకుంది . ముంబై పోలీసులపై చేసిన విమర్శల కారణంగానే ఆమె పై మరో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే స్థానిక లాయర్ కంగనా పై మొదటి కేసును నమోదు చేశాడు. సుశాంత్ కేసులో ఆమె ముంబైపోలీసులను నిందించిందని, అది చట్టరీత్యా నేరమని ఆమె పై ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా కంగనా దేశ పరువు తీసిందని, పోలీసులు, ప్రభుత్వ అధికారుల విలువను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు పై వెంటనే రియాక్ట్ అయిన కంగనా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్ వదిలింది. అందులో తాను ఓ ఫాసిస్ట్ ప్రభుత్వంతో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది . ' క్యాండిల్ మార్చ గ్యాంగ్, అవార్డ్ వాప్సి గ్యాంగ్ చూడండి ఫాసిజాన్ని ఎదుర్కుంటే ఇలా అవుతుంది. మీకేంపట్టదు, మిమ్మల్ని ఎవరూ అడగరు కూడా కానీ నన్ను చూడండి ప్రశ్నించినందుకు మహరాష్ట్రలో ఫాసిస్ట్ ప్రభుత్వంతో పోరాడుతున్నాను.
నా జీవితానికీ ఓ అర్థం ఉంది. మోసపూరిత ప్రభుత్వంతో పోరాడుతున్నా'నని కంగనా ట్వీట్ చేసింది. అంతేకాకుండా తాను జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని, ఇది వీర్ సావర్కర్, నేతా బోస్, ఝాన్సీ రాని వంటి గొప్ప వారి వారసత్వం అనుకుంటానని అన్నారు. దీని ద్వారా నా నిర్ణయల పట్ల మరింత నమ్మకం కలుగుతందని, జైలుకు వెళ్లిన ఎంతో మంది ఆదర్శ వీరుల్లాగానే తాను ఉంటానని కంగనా పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.