Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాలీవుడ్ నటుడితో అనుష్కశెట్టి.. కఠోరశ్రమలో జేజేమ్మ!
బాహుబలి తర్వాత సినిమా పరిశ్రమకు దూరంగానే ఉంటుంది. బాహుబలి సమయంలో తెరకెక్కిన భాగమతి చిత్రం గతేడాది రిలీజైంది. ఆ తర్వాత ఏడాది కాలంగా ఒక్క సినిమాను కూడ అంగీకరించలేదు. దాంతో సినిమా పరిశ్రమకు, ఆమెకు భారీగానే గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం విలక్షణ నటుడు మాధవన్తో కలిసి సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ నటించడం విశేషం. సైలెన్స్ చిత్రం తర్వలోనే సెట్స్పైకి వెళ్లనున్నది. వివరాల్లోకి వెళితే..
సెలైన్స్ చిత్రంలో
హలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ ఇటీవలే సైలెన్స్ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. కిల్ బిల్ 1, ఫ్రీ విల్లీ 2, ఫారెస్ట్ ఆఫ్ ది లివింగ్ డెడ్ లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సైలెన్స్ చిత్రంలో మైఖేల్ విలన్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది.
దేవసేనగా ఆ హీరోయిన్ కరెక్ట్.. అనుష్కకు రాజమౌళి ఝలక్.. ఒకే బ్యూటీపై ప్రభాస్, రానా..
మూగ చెవిటి మహిళగా
వస్తాడు నా రాజు, ముంబై 125 కి.మీ చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి డైరెక్టర్. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి మూగ, చెవిటి మహిళ పాత్రలో కనిపిస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది.
బరువ తగ్గిన అనుష్క శెట్టి
సైలెన్స్ చిత్రంలోని పాత్ర కోసం అనుష్క బరువు తగ్గే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే పలు రకాల కసరత్తులతో భారీగా బరువు తగ్గినట్టు సమాచారం. ఇటీవల దర్శకుడు రాజమౌళి కుమారుడి వివాహ వేడుకలో అనుష్క శెట్టి బరువు తగ్గి సన్నగా కనిపించిన తెలిసిందే.
అమెరికా నేపథ్యంతో షూట్
సైలెన్స్ సినిమా షూటింగ్ ప్రధానంగా అమెరికా నేపథ్యంలో జరుగనున్నది. దాంతో సినిమా షూటింగ్కు కావాల్సిన లోకేషన్ల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరపై రూపొందనున్నది.