Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
గెస్ట్ రోల్లో అనుష్క.. చిరంజీవి కోసమేనా!
భాగమతి చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతోంది. కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం అనుష్క విదేశాలకు వెళ్లి బరువు తగ్గింది. ఇప్పుడిప్పుడే అనుష్క కొత్త చిత్రాలని అంగీకరిస్తోంది. తాజాగా అనుష్కకు సంబందించిన ఓ వార్త ఆసక్తి రేపుతోంది. ప్రతిష్టాత్మకమైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా నరసింహారెడ్డిలో అనుష్క స్పెషల్ రోల్ లో మెరవబోతోందనే టాక్ వినిపిస్తోంది.
కొన్ని నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అనుష్కని ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో అనుష్క కూడా కాదనలేకపోయిందట. ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కి బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా అనుష్క చేరికతో సైరాపై మరింత హైప్ పెరగడం ఖాయం.
అనుష్క పాత్ర గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తొలి సారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఈ ఏడాది దసరాగా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోందనేది లేటెస్ట్ టాక్ .