Don't Miss!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్లీ కత్తి పట్టనున్న అనుష్కశెట్టి.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ అగ్రహీరోతో!
బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత అనుష్క శెట్టి చాలా గ్యాప్ తీసుకొని మరోసారి వెండితెరపైన విజృంభించేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రెడీ అవుతున్నారు. రాంచరణ్ నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో అనుష్క కీలక పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై హీరో రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను అనుష్క పోషిస్తున్నారు. వివారాల్లోకి వెళితే..
సైరా కోసం అనుష్కశెట్టి
సంచలన విజయం సాధించిన భాగమతి చిత్రంలో అనుష్క చివరిసారిగా కనిపించారు. కొద్దికాలంగా స్థూలకాయాన్ని తగ్గించుకొనేందుకు విదేశాలకు వెళ్లడంతో కొంత గ్యాప్ ఏర్పడింది. తాజాగా సైరాలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ వెండితెరపైన కనిపించేందుకు అవకాశం ఏర్పడింది.
13 ఏళ్ల తర్వాత చిరు, అనుష్క కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవితో అనుష్క నటించడం ఇది రెండోసారి. గతంలో 2006లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో అనుష్క స్పెషల్ పాటలో కనిపించింది. అప్పటి నుంచి అనుష్క కు చిరంజీవితో నటించే అవకాశం రాలేదు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నది.
అనుష్కపై స్పెషల్ సాంగ్తోపాటు
వాస్తవానికి అనుష్క తాజా షెడ్యూల్లో సైరా చిత్ర యూనిట్తో జతకలువాల్సింది. అయితే ఇటీవల సైరా సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అనుష్క ఎంట్రీ లేటైనట్టు తెలిసింది. ప్రస్తుతం సెట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. తాజా చివరి షెడ్యూల్లొ అనుష్కపై సీన్లు, చిరంజీవితో ఓ ప్రత్యేక పాటను కూడా చిత్రీకరిస్తారని తెలిసింది.
సైలెన్స్, లార్డ్ అయ్యప్ప మూవీలో
భాగమతి తర్వాత అనుష్క సైరాతోపాటు సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో ఎన్నారై పారిశ్రామిక వేత్తగా అనుష్క కనిపించబోతున్నారు. అలాగే సంతోష్ శివన్ రూపొందించే లార్డ్ అయ్యప్ప అనే చిత్రంలో కీలక పాత్రను అనుష్క పోషించనున్నారు.