టూ పీస్లో అర్జున్ రెడ్డి పిల్ల స్టన్నింగ్ షో: ఇప్పటి వరకూ చూపించిన వాటికి మించేలా!
ఈ దశాబ్ద కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అందులో షాలినీ పాండే ఒకరు.
ఆరంభంలోనే సెన్సేషన్గా మారిన ఈ చిన్నది.. ఆ తర్వాత అనుకున్న రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా షాలినీ సోషల్ మీడియాలో తనదైన రీతిలో అందాలను ఆరబోస్తూ.. తాజాగా ఓ పిక్ను వదిలింది. దానిని మీరే చూసేయండి మరి!

అర్జున్ రెడ్డితో సెన్సేషన్గా: 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' అనే చిత్రం ద్వారా షాలినీ పాండే నటిగా పరిచయమైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఈ చిత్రంలో షాలినీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతలా ఇందులో ప్రీతి పాత్రలో జీవించేసింది. ఆ తర్వాత ఆమెకు విశేషమైన గుర్తింపుతో పాటు ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

ఆ సినిమాల్లోనూ మెరిసినా: 'అర్జున్ రెడ్డి' తర్వాత షాలినీ పాండే తెలుగులో వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది. కానీ, 'మహానటి', 'యన్.టి.ఆర్.. కథానాయకుడు' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, వీటితో ఆమెకు సరైన పేరు రాలేదు. ఆ తర్వాత '118', 'ఇద్దరి లోకం ఒక్కటే', 'నిశ్శబ్దం' వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే, హిట్ను మాత్రం అందుకోలేకపోయింది.

ఆ భాషల్లో వరుస చిత్రాలు: తెలుగులో సరైన రీతిలో ఆఫర్లను సొంతం చేసుకోలేకపోయినా.. షాలినీ పాండే మాత్రం తమిళం, హిందీలో ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కోలీవుడ్లో '100% కాదల్', 'గొరిల్లా', వంటి చిత్రాలను చేసి పేరు తెచ్చుకుంది. అలాగే, హిందీలో 'మేరీ నిమ్మో', 'బమ్ఫాడ్', 'జయేష్ భాయ్ జోర్దార్' వంటి సినిమాలతో వచ్చింది. తద్వారా అక్కడా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు ఒకటే.. సిరీస్లు: అందానికి అందం, నటనకు నటనతో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న షాలినీ పాండే.. ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమాలోనే నటిస్తోంది. అది కూడా హిందీలో 'మహారాజా' అనే ఫిల్మ్ చేస్తోంది. దీనితో పాటు ఆమె కొన్ని వెబ్ సిరీస్లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా తెలుగులో కొన్ని కథాపరమైన చర్చల్లో సైతం పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది.
అందులోనే యమ బిజీగా: తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న షాలినీ పాండే.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన రేంజ్ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్ను కూడా ఖుషీగా ఉంచుతోంది.

అందాలతో షేక్ చేస్తోంది: సోషల్ మీడియాలో హీరోయిన్ షాలినీ పాండే సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్లో హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ తీసుకున్న ఫొటోషూట్లతో తెగ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్ను షేక్ చేసి పడేస్తోంది.

టూ పీస్లో టెంప్టింగ్ ఫోజ్: బోల్డు హీరోయిన్ షాలినీ పాండే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీ ధరించి ఫొటోను దిగింది. పైగా బెంచ్పై పడుకుని ఓ కాలు పైకెత్తి టెంప్టింగ్ ఫోజు పెట్టింది. ఇక, ఈ ఫొటోలో షాలినీ తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











