Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమీషా పటేల్ అరెస్ట్కు రంగం సిద్ధం.. పీకల్లోతు కష్టాల్లో బద్రి హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో జతకట్టి బద్రిలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో పడింది. రుణం ఎగవేత, చీటింగ్ కేసులో ఆమె అరెస్ట్కు రంగం సిద్ధమైంది. చెక్ బౌన్స్ కేసును విచారించిన కోర్టు తాజాగా అరెస్ట్కు ఆదేశాలు జారీ చేయడంతో అమీషా కష్టాల్లో కూరుకుపోయింది. అయితే అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయ్యే నేపథ్యంలో అమీషా మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె స్పందన వ్యక్తం కాలేదు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
సినిమా కోసం అప్పు
అమీషాపై కేసు నమోదు చేసిన ఫైనాన్షియర్ అజయ్ సింగ్ స్పందిస్తూ బాలీవుడ్ చిత్ర నిర్మాణం కోసం కునాల్, అమీషా పటేల్ ఇద్దరు రూ.2.50 కోట్ల మేర రుణం తీసుకొన్నారు. 2018లో సినిమా రిలీజ్ అయిన తర్వాత రుణాన్ని చెల్లిస్తామని ఒప్పందం చేసుకొన్నారు. అయితే సినిమా ఆగిపోవడం, 2018లో డబ్బు చెల్లించకపోవడంతో పలుమార్లు ఆమె దృష్టికి తీసుకొచ్చాం. కానీ అమీషా తమ సంప్రదింపులకు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాం అని అజయ్ సింగ్ పేర్కొన్నారు.
సినిమా ఆగిపోవడంతో
ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిసి అమీషా, కునాల్ను డబ్బు చెల్లించే విషయాన్ని అడిగాం. ఆ క్రమంలో వారు ఇచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ అయింది. దాంతో వారిపై మరింత ఒత్తిడి తీసుకువచ్చాన. ఆ సమయంలో నాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఏం చేస్తావో చేసుకో.. దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారు. ప్రముఖుల ఫోటోను చూపించి అమీషా బెదిరింపులకు పాల్పడ్డారు అని ఫైనాన్సియర్ అజయ్ పేర్కొన్నారు.
ఫైనాన్సియర్కు టోకరా
నా డబ్బు వాపసు తీసుకొనేందుకు ప్రయత్నాలు ఆపలేదు. ఆ తర్వాత నేను చేసిన ఫోన్ కాల్స్కు అమీషా, కునాల్ స్పందించకపోవడంతో లీగల్ నోటీసులు ఇచ్చాను. వాటికి కూడా సమాధానం ఇవ్వకపోవడంతో రాంచీ జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశాను. ఆ క్రమంలో రాంచీ కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేశారు అని అజయ్ సింగ్ వెల్లడించారు.
బాలీవుడ్ చిత్రం దేశీ మ్యాజిక్
బాలీవుడ్లో దేశీ మ్యాజిక్ అనే సినిమా నిర్మాణం కోసం అమీషా, కునాల్ ఫైనాన్స్ తీసుకొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్కు నోచుకోలేదు. ఆక్రమంలో అజయ్ సింగ్ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కొద్దికాలంగా డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఫైనాన్సియర్ కేసు నమోదు చేశారు.