Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
బద్రి హీరోయిన్ కి షాక్.. వారెంట్ జారీ చేసిన కోర్టు.. అసలు ఏమైందంటే?
అమీషా పటేల్ అంటే ఇప్పటి తరం వారికి వెంటనే తట్టక పోవచ్చు కానీ ఈ భామ తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న అమీషా మీద కోర్టు వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా
చేతులో సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది అమీషా . అయితే భూపాల్ కోర్టు బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు వ్యతిరేకంగా ఒక బెయిలబుల్ వారెంట్ చేసింది. అమీషా పటేల్పై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది, తదుపరి విచారణ సమయంలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం అమీషా మీద ఈ వారెంట్ జారీ అయింది.
డబ్బులు తీసుకుందని
జాతీయ న్యూస్ ఛానల్స్ ' కథనం ప్రకారం, అమీషా డిసెంబర్ 4న విచారణ కోసం భోపాల్ కోర్టుకు హాజరు కావలసి ఉంది. ఈ కోర్టులో అమీషా రూ.32.25 లక్షల చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమీషాపై ఈ కేసును దాఖలు చేసింది. సినిమా తీయడానికి అమీషా తన దగ్గర డబ్బులు తీసుకుందని యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపిస్తోంది.
బౌన్స్ అయ్యాయి
యూటీఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది రవి పంత్ తెలిపిన వివరాల ప్రకారం ఫస్ట్ క్లాస్ జిల్లా జడ్జి రవి కుమార్ బోరాసి ఈ వారెంట్ జారీ చేశారు. అమీషా పటేల్ ప్రొడక్షన్స్ యుటిఎఫ్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 32 లక్షల 25 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. అందుకు ప్రతిగా కంపెనీకి రెండు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు బ్యాంకులో వేయగా, అవి బౌన్స్ అయ్యాయి. అనంతరం జిల్లా కోర్టులో కేసు వేశారు.
అమీషా పటేల్పై వారెంట్ జారీ
దీనిని విన్న న్యాయమూర్తి అమీషా పటేల్పై వారెంట్ జారీ చేశారు. ఇండోర్లోనూ చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్పై కేసు నమోదైంది. నిషా అనే అమ్మాయి నుంచి అమీషా పది లక్షల రూపాయలు తీసుకుని దానికి బదులుగా చెక్కు ఇచ్చారు కానీ ఆ చెక్కు కూడా బౌన్స్ అయింది. ఇప్పుడు భోపాల్ కోర్టు అమీషాను డిసెంబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో అమీషా స్వయంగా వస్తారా లేక ఆమె తరపు న్యాయవాది వస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి.
Recommended Video
అరెస్ట్ వారెంట్ జారీ
దానికి బదులుగా ఆమె ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయట. ఈ క్రమంలో డిసెంబర్ 4న అమీషా కోర్టుకు హాజరు కాకపోతే, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే అమీషా పటేల్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె మరోసారి తన సూపర్హిట్ చిత్రం 'గదర్' సీక్వెల్లో సన్నీ డియోల్ మరియు ఉత్కర్ష్ శర్మతో కలిసి నటిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది నేడు.