Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగన రనౌత్కు మరో షాక్.. పోలీసులకు ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు
బాలీవుడ్ నటి కంగన రనౌత్పై మరో కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, ప్రకటనలు చేశారనే ఆరోపణలపై ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంతో ఈ వార్త సంచలనంగా మారింది. అయితే తనపై కేసు నమోదు విషయంపై ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
మమత ప్రతిష్టను దెబ్బ తీసేలా
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసత్య ఆరోపణలు చేసి ఆమె ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సామాజిక కార్యకర్త, పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం మత ఘర్షణల ఫోటోలను, ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు గాను కంగన రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెషన్షన్కు గురైన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం
కంగన రనౌత్ తన అధికార ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారు. మమతా బెనర్జీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. కాబట్టి ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రిజు దత్తా ఫిర్యాదు చేశారు.
హింసను ప్రేరేపించేలా
కంగన ట్విట్టర్ అకౌంట్ సస్పెన్షన్పై ట్విట్టర్ ప్రతినిధి స్పందిస్తూ.. విద్వేషాలను రెచ్చగొట్టడానికి, హింసను ప్రేరేపించేలా కంగన ట్వీట్లు చేశారు. దాంతో ఆమె అకౌంట్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆమె ట్విట్టర్ అకౌంట్ను రద్దు చేస్తున్నామని తెలిపారు.
Recommended Video
కంగన నటించే చిత్రాలు..
ఇదిలా ఉండగా, కంగన రనౌత్ నటించిన తలైవి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు. తేజాస్, దాకడ్, మణికర్ణిక రిటర్న్స్, ఇతర చిత్రాల్లో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందే చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు.