Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా బారిన పడ్డ సీఎంపై నగ్మా సెటైర్లు.. ఇప్పుడైనా వదిన చేసిన పాపడ్లు తిను.. .
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయంపై సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆగస్టు 24వ తేదీన సీఎం ఖట్టార్ కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే హర్యానా సీఎంను ఉద్దేశించి నగ్మా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆగస్టు 24వ తేదీన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ట్వీట్ చేస్తూ.. నాకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. రిపోర్టులు కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. నాకు దగ్గరగా పనిచేసే సిబ్బందికి నా మనవి ఏమిటంటే.. గత వారం నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులందూ వెంటనే టెస్టులు చేసుకొండి.. వెంటనే తప్పనిసరిగా క్వారంటైన్కు వెళ్లండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
సీఎం ఖట్టార్ ట్వీట్కు సమాధానం ఇస్తూ.. ఇప్పుడు ఈయనకు కూడా కరోనానా? హే రామ్.. కోవిడ్ 19. ఇప్పుడైన వదిన చేసిన పాపడ్ తప్పకుండా తినండి. హర్యానా సీఎం గారు.. కశ్మీరీ కూతుళ్ల గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడైనా సరిదిద్దుకొండి అంటూ ఆమె ట్వీట్ చేశారు.
అయితే సీఎం, వయసులో పెద్దవారనే విషయాన్ని పట్టించుకోకుండా నగ్మా రాజకీయాలు చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు అంటూ కొందరు ట్వీట్లు చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.