Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా బారిన పడ్డ సీఎంపై నగ్మా సెటైర్లు.. ఇప్పుడైనా వదిన చేసిన పాపడ్లు తిను.. .
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయంపై సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆగస్టు 24వ తేదీన సీఎం ఖట్టార్ కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే హర్యానా సీఎంను ఉద్దేశించి నగ్మా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆగస్టు 24వ తేదీన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ట్వీట్ చేస్తూ.. నాకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. రిపోర్టులు కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. నాకు దగ్గరగా పనిచేసే సిబ్బందికి నా మనవి ఏమిటంటే.. గత వారం నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులందూ వెంటనే టెస్టులు చేసుకొండి.. వెంటనే తప్పనిసరిగా క్వారంటైన్కు వెళ్లండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
సీఎం ఖట్టార్ ట్వీట్కు సమాధానం ఇస్తూ.. ఇప్పుడు ఈయనకు కూడా కరోనానా? హే రామ్.. కోవిడ్ 19. ఇప్పుడైన వదిన చేసిన పాపడ్ తప్పకుండా తినండి. హర్యానా సీఎం గారు.. కశ్మీరీ కూతుళ్ల గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడైనా సరిదిద్దుకొండి అంటూ ఆమె ట్వీట్ చేశారు.
అయితే సీఎం, వయసులో పెద్దవారనే విషయాన్ని పట్టించుకోకుండా నగ్మా రాజకీయాలు చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు అంటూ కొందరు ట్వీట్లు చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.