Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కంగనపై క్రిమినల్ కేసు ... కారణం ఇదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ , మహా సర్కార్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. ట్వీట్ లో నిరసనకారులను ఉగ్రవాదులు అంటూ అభివర్ణించడంతో ఆమెపై ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ, 504 కింద కేసు నమోదైంది.
ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగన వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా కంగనా పై మండిపడుతున్నారు. అటు ముంబైలో కంగన కార్యాలయం కూల్చివేతకు కారణమైన మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన వ్యతిరేకంగా వెళుతోంది.
ప్రస్తుతం ఆ కూల్చివేత వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం 2 కొట్ల రూపాయలను పరిహారం ఇవ్వాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముంబైను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా కంగనా అభివర్ణించిన విషయం తెలిసిందే .