Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగనపై క్రిమినల్ కేసు ... కారణం ఇదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ , మహా సర్కార్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. ట్వీట్ లో నిరసనకారులను ఉగ్రవాదులు అంటూ అభివర్ణించడంతో ఆమెపై ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ, 504 కింద కేసు నమోదైంది.
ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగన వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా కంగనా పై మండిపడుతున్నారు. అటు ముంబైలో కంగన కార్యాలయం కూల్చివేతకు కారణమైన మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన వ్యతిరేకంగా వెళుతోంది.
ప్రస్తుతం ఆ కూల్చివేత వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం 2 కొట్ల రూపాయలను పరిహారం ఇవ్వాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముంబైను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా కంగనా అభివర్ణించిన విషయం తెలిసిందే .