Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ లో దిగిన బాలీవుడ్ బ్యూటీ.. 500కోట్ల సినిమా ఎంతవరకు వచ్చిందంటే?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలను పెద్దగా లెక్క చేయని స్టార్స్ ఇప్పుడు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా ఆఫర్ వస్తే చేయాలని సిద్ధంగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా టాలీవుడ్ ప్రాజెక్టులలో నటించడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదివరకే ఆయన మెగాస్టార్ సైరా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు ఏ సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
హైదరాబాద్ వచ్చేసిన దీపికా
బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అందుకే మన హీరోలతో నటించే అవకాశం వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీపికా పదుకునే కూడా ప్రభాస్ ప్రాజెక్ట్ K లో మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చారు. గత కొంతకాలంగా ముంబైలోనే వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటున్నా దీపికా పదుకొనే చాలా కాలం తర్వాత హైదరాబాదులో అడుగుపెట్టారు.
ప్రభాస్ తో కీలక సన్నివేశాలు
ప్రాజెక్ట్ కె రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఇక హీరో హీరోయిన్ కి సంబంధించిన పలు కీలకమైన సన్నివేశాలను ఒక ప్రత్యేకమైన సెట్లో మొదలు పెట్టబోతున్నారు. దీపికా పదుకొనే రెండు రోజుల వర్క్ షాప్ అనంతరం రెగ్యులర్ షూటింగ్ లో బిజీ కానుంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
సరికొత్త క్యారెక్టర్ లో..
దాదాపు 20 రోజుల పాటు ఆమె చిత్ర యూనిట్ తో కలిసి వర్క్ చేయనున్నారట. ఇక షూటింగ్ మధ్యలో ఆమె రెండు రోజులు బ్రేక్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా దీపికా పదుకొనె నెవర్ బిఫోర్ అనేలా చాలా కొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.
ఎంతవరకు ఫినిష్ అయ్యిందంటే?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినీదత్ 500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా సినిమాను భారీగా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ పనులు 20 శాతం మాత్రమే ఫినిష్ అయ్యాయట. సినిమాను 2024లో విడుదల చేసే విధంగా వర్క్ కొనసాగిస్తారట.
ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లుగా రెమ్యునరేషన్
ఇప్పటికే ప్రభాస్ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. అంతే కాకుండా కొన్ని దేశాల్లో కూడా అతని స్థాయి పెరుగుతోంది. బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ఎలాంటి విజయాన్ని అందుకున్నడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాజెక్టు K తో కూడా అతని స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ కాస్త ఎక్కువ టైమ్ స్పెండ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగానే నిర్మాత సి.అశ్వనీదత్ వంద కోట్లకు పైగా పారితోషికం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.