Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
మహారాణి ఆశీర్వాదం వల్లే.. వైరల్ అవుతున్న దీపికా పదుకొనె ఫోటో!
టెంపర్ హిందీ రీమేక్ చిత్రం సింబా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికి ఈ చిత్రం 200 కోట్ల మార్క్ కు చేరువైనట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఛితంలో రణవీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించారు. రణవీర్ సింగ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నిర్మాత కరణ్ జోహార్ తన నివాసంలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది.
2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!
కాగా పార్టీలో ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ దీపికకు వంగి నమస్కరిస్తుడగా ఆమె వీరు ముగ్గురిని ఆశీర్వదిస్తుంది. ఈ ఫోటోని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్గా మారింది. రాణి పద్మావతి ఆశీస్సులతో ఈ చిత్రం విజయం సాధించిందని కరణ్ జోహార్ క్యాప్షన్ పెట్టారు. ఇది నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది.
రోహిత్ శెట్టి బాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రానికి హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్చి రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కామియో రోల్ పోషించారు.