Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కంటతడి పెట్టిన దీపిక పదుకోన్.. షూటింగ్లో భావోద్వేగానికి గురై..
యాసిడ్ దాడికి గురైన మహిళ జీవిత కథతో తెరకెక్కుతున్న ఛపక్ చిత్రంలో నటించడమే కాకుండా దీపికా పదుకోన్ స్వయంగా నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇటీవల మెట్ గాలా, కేన్స్ రెడ్ కార్పెట్పై హంగామా చేసిన ఈ అందాల భామ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో బిజీగా మారిపోయారు. లక్ష్మీ అగర్వాల్ అనే బాధితురాలి కథను దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు.
ఛపక్ సినిమా, దీపిక పదుకోన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్లో తొలి రోజున దీపిక భావోద్వేగానికి గురయ్యారట. సినిమాకు సంబంధించిన మొట్టమొదటి సన్నివేశంలో ఆమె ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకొన్నారట. మేఘనా గుల్లార్తో తన పాత్ర మాలతి సీన్ గురించి చర్చిస్తూ భావోద్వేగానిక లోనై.. తన కంట్రోల్ చేసుకోలేకపోయారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఛపక్ సినిమా శరవేగంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 19న ముగిసింది. ఆ తర్వాత మాలతి పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేయగా విశేష స్పందన వచ్చింది. మాలతి పాత్రలోకి మారిపోయిన తీరును చూసి దీపికను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఛపక్ సినిమాను 2020, జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.